Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు రైళ్లు ఢ : నలుగురు మృతి, 43 మందికి గాయాలు
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో గురువారం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ హైస్పీడు రైలు, మరో రైలింజన్ని ఢకొీని పక్కనే ఉన్న రైల్వేస్టేసన్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ సహా నలుగురు మంది మృతిచెందారు. మరో 43 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమా చారం. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...అంకారా రైల్వే స్టేషన్ నుంచి 8కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్సండిజ్ రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్య ప్రావిన్స్లోని కోన్యాకు బయల్దేరిన ఓ హై స్పీడ్ రైలు, ట్రాక్ తనిఖీ చేస్తున్న మరో రైలింజన్ను బలంగా ఢకొీనడంతో ఈ ప్రమాదం జరిగింది. సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని, బోగీల్లో చిక్కు కున్నవారిని వెలికితీస్తున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తు న్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 206 మంది ప్రయా ణికులు ఉన్నారు. .ఈ ఘటనపై టర్కీ గవర్నర్ వాసిప్ సాహిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి కారణాలు గుర్తించేందుకు సాంకేతిక దర్యాప్తు చేపట్టామని అన్నారు. గత జూలైలో జరిగిన ఓ రైలు ప్రమాదంలో 24 మంది చనిపోయారు.