Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: బోర్డర్ పెట్రోల్ పోలీసులు అరెస్ట్ చేసిన గ్వాటెమాలాకు చెందిన ఏడేండ్ల బాలిక డిహైడ్రేషన్, షాక్తో మరణించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. బోర్డర్ పెట్రోల్ పోలీసులు అరెస్ట్ చేసిన బాలిక మరణించిన విషయాన్ని అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ (డీిహెచ్ఎస్) కూడా నిర్ధారించింది. బోర్డర్ పోలీసులు అరెస్ట్ చేసిన దాదాపు ఏడుగంటల తరువాత గ్వాటెమాలాకు చెందిన ఈ బాలిక డిహైడ్రేషన్తో పాటు షాక్కు గురై మరణించిందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొన్నది. ఈ నెల ఆరవతేదీన ఈ బాలికను, ఆమె తండ్రిని అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర సరిహద్దుల్లో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారని వెల్లడించింది. ఆ మరునాడు ఈ బాలికకు 41 డిగ్రీల హై టెంపరేచర్తో జ్వరం వచ్చిందని, ఆమెను హెలీకాప్టర్లో టెక్సాస్లోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని ఈ పత్రిక తెలిపింది. అరెస్టయిన వారికి ఆహారం నీరు సరఫరా చేస్తున్న సంస్థ నిర్దిష్ట విధానాలను అనుసరిస్తోందా? లేదా? అన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించింది. అయితే ఈ బాలిక పేరును మాత్రం డిహెచ్ఎస్ అధికారులు వెల్లడించలేదు.
ఈ బాలిక మరణంతో సరిహద్దుల వద్ద బోర్డర్ పోలీస్ స్టేషన్లు, కస్టమ్స్ బోర్డర్ప్రొటెక్షన్ కేంద్రాలలో వున్న నిర్బంధితులకు అందచేస్తున్న సౌకర్యాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం చేపట్టిన తరువాత ట్రంప్ అమెరికా మెక్సికో మధ్య సరిహద్దు గోడ నిర్మిస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇరుదేశాల సరిహద్దుల మధ్య రాకపోకలపై సరిహద్దు భద్రతా దళాలు నిఘా ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.