Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షా విధానం, ఫీజుల పెంపుపై ఆగ్రహం
పారిస్ : ఓ వైపు పచ్చకోటు ఉద్యమం, మరోవైపు విద్యార్థుల ఆందోళనలతో ఫ్రాన్స్ దద్దరిల్లుతోంది. ఇంధన ధరలకు వ్యతిరేకంగా ప్రతీ శని, ఆదివారాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు (పచ్చకోటు ఉద్యమం) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వారాంతం వేలాది మంది విద్యార్థులు సైతం అధ్యక్షుడు మేక్రాన్కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. మేక్రాన్ ప్రభుత్వం పరీక్ష విధానంలో మార్పులు చేయటం, ఫీజుల్ని పెంచటాన్ని విద్యార్థి లోకం తీవ్రంగా పరిగణిస్తోంది. పరీక్షల ఫీజు పెంచటాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా 450 హైస్కూళ్లలోని విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. విద్యార్థి సంఘాలు, మేథావులు, ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల్ని వెంటనే నిలిపివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షల్ని కఠినతరం చేయాలని మేక్రాన్ ప్రభుత్వం గత ఏడాది నిర్ణయం తీసుకుంది. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు పేద కుటుంబాల్లోని విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచిత వర్సిటీ విద్య, పెద్ద సంఖ్యలో ప్రవేశాలకు అవకాశం కల్పించటం, ప్రతీ ఏటా 2 బిలియన్ యూరోలు ఉన్నత విద్యపై వ్యయం చేయటం...మొదలైన డిమాండ్లను విద్యార్థి సంఘాలు ప్రభుత్వం ముందు పెట్టాయి.