Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యపై ఈయూ నేతలు ఇంతవరకూ స్పందించలేదని టర్కీ ఆరోపించింది. ఖషోగ్గి హత్యకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లత్ కవు సోగ్లూ డిమాండ్ చేశారు. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌదీ యువరాజు సల్మాన్ను తప్పిం చేందుకు ఓ వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోవైపు ఈయూ సభ్యదేశాల నేతలు ప్రయత్నిస్తున్నారని దుయ్య బట్టారు. దోహలో జరిగిన సదస్సులో కవుసోగ్లూ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఖషోగ్గి హత్యపై పారదర్శ కమైన విచారణ కోసం తమ అధ్యక్షు డు ఎర్డోగాన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈకేసుకు సంబంధించి ఎలాంటి ప్రసారాలు చేయొద్దంటూ ఈయూ నేతలు పలు మీడియా సంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని అన్నారు. ఖషోగ్గి హత్యలో సౌదీ యువ రాజు పాత్ర ఉందని తాము కూడా విశ్వసిస్తున్నామని సీఐఏ డైరెక్టర్ గినా హాస్పెల్ చేసిన వ్యాఖ్యలను కవుసోగ్లూ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కేసు పురోగతికి అమెరికా, ఈయూ సహకరించట్లేదని అన్నారు.
ఖషోగ్గి హత్యకేసుపై పారదర్శక విచారణకు ఒత్తిడి తెస్తామని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటె రస్ అన్నారు. ఈకేసుకు సంబంధించి కీలక సాక్ష్యాధారాలు లభించినట్టు సీఐఏ పేర్కొందన్నారు. ఈఏడాది అక్టోబర్2న ఇస్తాంబుల్లోని సౌదీ దౌత్య కార్యాలయం లోపలికి వెళ్లిన జమాల్ ఖషోగ్గి బయటకు తిరిగి రాలేదు. ఆయన మృతిపై పలు అను మానాలు తలెత్తాయి. సౌదీ రాజు నిరంకుశ పాలనపై కథనాలు రాసినం దుకే ఖషోగ్గి హత్యకు గురైనట్టు నిఘా బృందాలు అనుమాని స్తున్నాయి. ఈ కేసులో సౌదీ యువ రాజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.