Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేమ్ : ఇజ్రాయిల్తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యమని వెనిజులా ప్రతిపక్ష నేత జువాన్ గైడో ఉద్ఘాటించారు. ఇజ్రాయిల్ మీడియా సంస్థ హయోమ్తో ఆయన మాట్లాడారు. 'ఇజ్రాయిల్, వెనిజులా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తాను. ఇజ్రాయిల్కు దౌత్యవేత్తను నియమిస్తాం. వెనిజులా ఎంబసీని టెల్అవీవ్ నుంచి జెరూసలేమ్కు తరలిస్తాం' అని అన్నారు. ఇదిలా ఉండగా, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించాలని అమెరికా కుట్ర పన్నింది. వెనిజులా ప్రతిపక్ష నేత గైడో తనకు తానుగా అధ్యక్షుడుగా ప్రకటించుకోగా...అమెరికా, బ్రిటన్, యూరోపియన్ సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మదురో 67.7శాతం ఓట్లతో గెలుపొందారు. గైడో ఆయన గెలుపును జీర్ణించుకోలేకపోయారు. మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మదురోకు మద్దతుగా రష్యా, చైనా దేశాలు నిలిచాయి. ఇజ్రాయిల్ మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ హయాంలో ఇజ్రాయిల్-వెనిజులా సంబంధాలు దెబ్బతిన్నాయి.