Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సానా : గతేడాది కాలంలో యెమెన్ ఉత్తర ప్రావిన్స్ల్లో బర్డ్ ఫ్లూ (హెచ్1ఎన్1) వల్ల 139మంది మరణించారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో 22మంది మరణించగా, 107మందికి ఇన్ఫెక్షన్ సోకిందని, ఇది ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. రాజధాని సానా, అమ్రాన్, ఇబ్ ప్రావిన్స్ల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. నాలుగేళ్ళుగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో దేశ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన మానవతా సంక్షోభంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. యెమెన్లో కలరా దాదాపు 10లక్షలమందికి పైగా సోకింది. 2వేల మందికి పైగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అరబ్ సైనిక సంకీర్ణానికి సౌదీ అరేబియా నేతృత్వం వహిస్తోంది. 2015లో అధ్యక్షుడు అబ్ రబ్బు మన్సార్ హదీని ప్రవాసంలోకి పంపి, రాజధాని సానాతో సహా దేశంలో ఉత్తర ప్రాంతంలో అధిక భాగాన్ని హుతీ రెబెల్స్ స్వాధీనం చేసుకున్నారు. దాంతో ప్రభుత్వానికి మద్దతుగా అరబ్ సైనిక సంకీర్ణం యెమెన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది.