Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీలా : రాప్లర్ మీడియా సంస్థ సీఈవో, జర్నలిస్ట్ మారియ రెస్సా అరెస్ట్ అయ్యారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టేని లక్ష్యంగా చేసుకొని ఆమె వరుస కథనాలు ప్రచురించారు. రోడ్రిగో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత హక్కుల ఉల్లంఘన ఘటనలు పెరిగిపోయాయని విమర్శించారు. రోడ్రిగోని అరెస్ట్ చేసినట్టు నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎన్బీఐ) బుధవారం ధ్రువీకరించింది. గతవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్న తమ జర్నలిస్టుల పట్ల ఓ అధికారి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల పట్ల రోడ్రిగో సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
ప్రజా శ్రేయస్సే తన పరమావధి అన్నారు. రోడ్రిగో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ మాఫియాపై వార్ పేరిట 3వేల మందిని పొట్టనబెట్టుకున్నారని విమర్శించారు. ఫిలిప్పీన్స్ ప్రత్యేక బలగాలు జరిపిన దాడుల్లో వందలాది మంది అమాయక ప్రజలు ఉన్నారని అన్నారు. ఆయన పాలనలో హక్కుల ఉల్లంఘన ఘటనలు పెరిగిపోయాయని అన్నారు. ఇదిలా ఉండగా, రెస్సా అరెస్ట్ను నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఫిలిప్పీన్స్ (ఎన్యూజేపీ ) ఖండించింది. సామాజిక చైతన్యం కోసం ప్రయత్నిస్తున్న రెస్సాను అరెస్ట్ చేయడం అక్రమమని ఎన్యూజేపీ చైర్మెన్ నొనారు ఎస్పినా తెలిపారు. ఆమె కృషికి ఫలితంగా తేడాది ' టైమ్ మ్యాగజైన్' సంస్థ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ప్రదానం చేసిన విషయాన్ని ఎన్యూజే ఈసందర్భంగా ప్రస్తావించింది.