Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్టయిన విద్యార్థులకు కోర్టులో ఊరట లభించింది. ఈనెల 20లోగా స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. వీరిలో ఇద్దరు భారతీయులు, ఓ పాలస్తీనియన్ ముందస్తుగా వాలంటరీ డిపార్చర్ అనుమతి పొందారు. మిగిలిన 17 మందిపై విచారణ జరిగింది. 17 మందిలో 15 మందికి అందులో 8 మంది తెలుగు విద్యార్థులకు వాలంటరీగా స్వదేశాలకు తిరిగి వెళ్లే అవకాశాన్ని కోర్టు కల్పించింది. 16వ యువతికి కూడా తిరిగి వెళ్లిపోయే అవకాశం కల్పించింది. కానీ, స్వచ్చందంగా కాకుండా ప్రభుత్వం తరుఫున తరలిస్తున్నట్టు యూఎస్ ప్రకటించింది.
ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్శిటీ కేసులో అరెస్ట్ అయిన విద్యార్థుల తుది విచారణ బుధవారం జరిగింది. కేలహౌన్ కౌంటీ జైలులో 12 మంది, మన్రో కౌంటీ జైలులో 8 మంది ఉన్నారు. 17వ విద్యార్థి యూఎస్ సిటిజన్ను పెళ్లి చేసుకున్నాడు. అందుకు అతను కేసు వాదించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 15 మంది విద్యార్థులు కోర్టు తీర్పుకు లోబడి స్వచ్చందంగా 20వ తేదీలోపు యూఎస్ వదిలివెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు కూడా తిరుగు ప్రయాణానికి సిద్దమవుతున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇండియన్ ఎంబసీ అధికారులను తెలంగాణ అమెరికన్ అసోసియేషన్(ఆటా-తెలంగాణ) కోరింది.