Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23 మంది మృతి
హరారే : జింబాబ్వేలో వరదలు పోటెత్తాయి. మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఆనకట్టలు తెగిపోవడంతో వరద నీరు ఇండ్లలోకి ప్రవహిస్తున్నది. రాజధాని హరారే నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న కదోమా ప్రాంతంలోని రెండు బంగారు గనుల్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో, గనుల్లో పనిచేస్తున్న 23 మంది కార్మికులు మృతిచెందారు.
మరికొందరు గనుల్లో చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గనుల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని రియోజిమ్ గని అధికార ప్రతినిధి విల్సన్ గ్వాతిరింగా అన్నారు. జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మర్సన్ నాంగాగ్వా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. జింబాబ్వేలో వజ్రం, బంగారం, బొగ్గు, ప్లాటినం గనులు ఎక్కువగా ఉంటాయి.