Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 మంది మృతి
యాంగాన్ : మయన్మార్లో పడవ బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 16 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ప్రత్యేక బృందాలు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టాయి. మయన్మార్ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... రఖైన్ రాష్ట్రంలోని మనాంగ్ లైట్హౌస్ సమీపంలో ఓ పడవ బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 26 మంది ఉన్నట్టు సమాచారం.
ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, గల్లంతైన 16 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ప్రతికూల వాతావరణంతో పాటు పరిమితికి మించి ప్రయాణీకులు పడవలో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పడవ ప్రమాదం జాంబియా రాజధాని లుసాకాలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతిచెందారు. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. నీటి ప్రవాహంలో కొట్టుకొనిపోయిన మరో 19 మందిని సురక్షితంగా రక్షించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. లేక్ మేరులో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. పరిమితికి మించిన ప్రయాణీకులు పడవల్లో ప్రయాణించడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా నిఘా అధికారులు అనుమానిస్తున్నారు.