Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27 మంది సైనికులు మృతి, 13 మందికి గాయాలు
టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. సైనికుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్ధాలతో నింపిన కారును పేల్చేశారు. ఈ దాడిలో 27 మంది మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఇరాన్ పారామిలిటరీ బలగాల అనుబంధ సంస్థ రివల్యూషనరీ గార్డ్స్ ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
మిలిటెంట్ల దాడిలో 27 మంది మృతిచెందగా, 13 మంది గాయపడ్డారు. కాగా, అమెరికా మద్దతిచ్చిన షా పాలన 1979లో ముగిసింది. ఇస్లామిక్ విప్లవం 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరాన్ నేతలంతా విజయోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు, నేతల భద్రత కోసం వెళ్తున్న సైనికులను లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్టు జైషే అల్ ఆదిల్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది.