Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌరులకు అమెరికా సూచన
వాషింగ్టన్ : ఉగ్రవాద ముప్పు కారణంగా పాకిస్తాన్కు పర్యటించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా అమెరికా తన పౌరులను కోరింది. పాకిస్తాన్లో దాడులకు ఉగ్రవాద గ్రూపులు కుట్రలు పన్నుతున్నాయని, అందువల్ల ఆ దేశానికి వెళ్లడంపై పున: పరిశీలన చేసుకోవాలని విదేశాంగ శాఖ తాజా పర్యాటక సూచనల్లో పేర్కొంది. పాక్లో కూడా బలూచిస్తాన్ ప్రావిన్స్, ఖైబర్ ఫక్తూన్ఖవా (కేపీకే) ప్రావిన్స్, పూర్వపు ఫెడరల్ ప్రభుత్వ అధీనంలోని గిరిజన ప్రాంతాలు (ఎఫ్ఏటీఏ)కు వెళ్ళవద్దని అమెరికన్లకు సూచించింది. సాయుధ ఘర్షణలు చెలరేగే అవకాశం వున్నందున పాక్ ఆక్రమిత కాశ్మీర్కు కూడా వెళ్ళవద్దని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం వుందని, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, యూనివర్శిటీలు, పర్యాటక కేంద్రాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఆరాధనా స్థలాలు వంటివి ప్రధాన లక్ష్యంగా మారే అవకాశం వుందని హెచ్చరించింది.