Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాక్కు అమెరికా హెచ్చరిక
వాషింగ్టన్: భారత్లోని పుల్వా మాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ను అమెరికా హెచ్చరిం చింది.ఉగ్రసంస్థలకు పాక్ స్వర్గధా మంగా మారిందని మండి పడింది. ఉగ్రసంస్థల నిర్మూలనకు పాకిస్తాన్ చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ సారా శాండర్స్ హెచ్చరించారు. 'ఉగ్రసంస్థ లకు స్వర్గధామంగా నిలిచిన పాకిస్థాన్ ఇక మీదట వారికి ఆశ్రయం ఇవ్వడం ఆపేయాలి. అలాగే వారికి మద్దతు ఇవ్వడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి' అని శాండర్స్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నిరోధించే విషయంలో భారత్కు అమెరికా ఎప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, జమ్ముకాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకొని పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ప్రపంచ దేశాలన్నీ ఈ దాడిని ఖండిస్తూ భారత్కు అండగా నిలుస్తున్నాయి.