Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు పోలింగ్
- ఓటు హక్కును వినియోగించుకోనున్న 84 మిలియన్ల ఓటర్లు
అబూజ : నైజీరియా అధ్యక్ష ఎన్నికల ప్రచారం శుక్రవారం ముగిసింది. శనివారం జరుగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుత దేశాధ్యక్షుడు, ప్రోగ్రెసివ్ కాంగ్రెస్ పార్టీ నేత ముహమ్మద్ బుహారీ, ప్రధాన ప్రత్యర్థి..పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేత అటీకు అబూబకర్ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా ఇరువురు నేతలు రాజధాని అబూజ వీధుల్లో భారీ ర్యాలీ తీశారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రిగ్గింగ్కు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు చేపడతామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును నమోదు చేయాలని అబూబకర్, బుహారీ వేర్వేరు ర్యాలీల్లో ఓటర్లను అభ్యర్థించారు. ఇదిలా ఉండగా, నైజీరియా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్నారు. గతవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రస్త్తుత అధ్యక్షుడు బుహారీ , మాజీ ఉపాధ్యక్షుడు అబూబకర్ మధ్య తీవ్ర నెలకొనే అవకాశముంది. 2011లో అధ్యక్ష ఎన్నికలు జరిగిన సమయంలోనూ బుహారీ, అబూబకర్ వర్గీయుల మధ్య అల్లర్లు జరిగాయి.
ఈ అల్లర్లలో వెయ్యి మందికి పైగా మృతి చెందారు. ఈనెల16న అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.అధ్యక్ష పీఠం కోసం 73 మంది పోటీపడుతున్నారు. ఈఎన్నికల్లో 84మిలియన్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.