Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్కపక్కనే ఇజ్రాయిల్, పాలస్తీనా స్వతంత్ర రాజ్యాలు
- ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్
న్యూయార్క్ : ఇజ్రాయిల్, పాలస్తీనా...రెండు స్వతంత్ర రాజ్యాల ఏర్పాటే పాలస్తీనా సమస్యను పరిష్కరిస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. రెండు రాజ్యాలకు 'జెరూసలేం' రాజధానిగా ఏర్పాటుచేయాలనీ ఆయన సూచించారు. అప్పుడే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని గుటెర్రస్ అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి 'ప్లాన్-బీ' ఎంచుకునే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. 1975లో పాలస్తీనా ప్రజల హక్కులపై ఐరాస ఏర్పాటుచేసిన కమిటీని ఉద్దేశించి గుటెర్రస్ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల ప్రజలు పక్క పక్కనే శాంతియుతంగా జీవించినప్పుడే దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఐరాస తీర్మానాలు, గత ఒప్పందాలు, అంతర్జాతీయ చట్టాలు... మొదలైనవి పరిగణనలోకి తీసుకుంటే 'జెరూసలేం' రెండు రాజ్యాలకు రాజధానిగా ఉండటమే సరైన పరిష్కారాన్ని ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజాగా జరిగిన ఈ సమావేశంలో పాలస్తీనా సంక్షోభం అక్కడి ప్రజల్ని తీవ్ర నష్టానికి గురిచేసిందని గుటెర్రస్ ఆందో ళన వ్యక్తం చేశారు. పాలస్తీనాలో ఆక్రమణల పర్వం దశాబా ్దలుగా సాగిందనీ, దీనివల్ల అక్కడి ప్రజలు స్వీయ పాలనకు దూరమయ్యారనీ అన్నారు. పాలస్తీనా పునర్నిర్మాణానికి ఐరాస కట్టుబడి ఉందన్నారు. గాజాలో మానవ సంక్షోభం తలెత్తిందనీ, 20లక్షలమంది పాలస్తీనా పౌరులు పేదరికం లోకి కూరుకుపోయారనీ, నిరుద్యోగంతో బాధపడుతున్నార నీ, వైద్యం, విద్య, తాగునీరు, విద్యుత్...మొదలైన ప్రభుత్వ సేవలు చాలా తక్కువ పరిమితిలో అందుతున్నాయనీ అన్నారు. చాలా కొద్ది మంది యువతలో మాత్రమే భవిష్యత్ జీవితంపై ఆశలున్నాయని అన్నారు. దీనిపై అంతర్జాతీయ సమాజం తప్పకుండా దృష్టి సారించాలని ఆయన కోరారు.
ఆక్రమణలు చట్టవిరుద్ధం..
ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య పోరు తీవ్రరూపం దాల్చకుండా ఐరాస, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం మంచి ఫలితాల్ని ఇచ్చిందని గుటెర్రస్ కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో పాలస్తీనా శరణార్థులకు సహాయ కార్యక్రమాల్ని అందజేస్తున్న ఐరాస రిలీఫ్ ఏజెన్సీని ప్రశంసించారు. గాజా ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఆయన కోరారు.
వెస్ట్బ్యాంక్, తూర్పు జెరూసలేంలో ఇజ్రాయిల్ అక్రమ నిర్మాణాలు జరపటం, వాటిని విస్తరించే ప్రణాళికలు చేపట్టడం వల్లనే హింసాత్మక ఘటనలకు దారితీసిందని ఆయన అన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవన్నీ అక్రమం, చట్టవిరుద్ధమనీ, ఇదంతా కూడా పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య అపనమ్మకాన్ని, అభద్రతను మరింత పెంచాయనీ, సమస్యను మరింత సంక్లిష్టంగా మార్చిందనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.