Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈయూ, బ్రిటన్లకు ట్రంప్ అభ్యర్థన
వాషింగ్టన్ : సిరియాలో అరెస్టయిన 800 మంది మిలిటెంట్లను తక్షణమే విచారించాలని బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ), బ్రిటన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థించారు. వీరిని విచారించడంలో జాప్యం చేసినట్టయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అరెస్టయిన సభ్యుల్లో అనేక మంది కరుడుగట్టిన ఐఎస్ సభ్యులున్నారని అన్నారు. వీరు జనజీవన స్రవంతిలో కలిసినట్టు నటించి ఉగ్రదాడులకు ప్రణాళిక వేసేందుకు కుట్ర పన్నినట్టు తమ విచారణలో తేలిందన్నారు. కాగా, సిరియాలో ఉగ్రసంస్థలపై జయభేరి మోగించినట్టు ట్రంప్ గతనెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనే పథ్యంలో ఇక్కడ మోహరించిన 2వేల మంది యూఎస్ బలగాలను వెనక్కి పిలిపించారు. అయితే, అమెరికా మద్దతిస్తున్న కుర్దుతిరుగుబాటుదారులు మిలిటెంట్ల స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాక్ సరి హద్దుతో పాటు సిరియాలో ఉగ్రవాదుల ప్రాభల్యమున్న నగరాల్లో తలదాచుకున్న 800 మంది ఐఎస్ సభ్యు లను కుర్దుతిరుగుబాటుదారులు అదుపులోకి తీసుకు న్నారు. వీరిలో ఎక్కువ మంది సభ్యులు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూలోని పలు సభ్య దేశాల నుంచి ఐఎస్లో చేరేందుకు వచ్చిన పౌరులని అమెరికా గుర్తించింది. వీరిని తక్షణమే విచారించకుంటే ప్రమాదమని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. సిరియాకు వెళ్లి ఐఎస్ శిబిరాల్లో శిక్షణ పొందినవారంతా తిరిగి స్వదేశాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2015లో లండన్ నగరం నుంచి ముగ్గురు యువతులు ఐఎస్లో చేరేందుకు సిరియాకు పారిపోయారు. ఆ ముగ్గురిలో షమీమా బేగం అనే ఓ యువతి ఇటీవల లండన్ నగరానికి చేరేందుకు ప్రయత్నిస్తున్నది. ఆమె మూడేండ్ల పాటు ఐఎస్లో శిక్షణ పొందినట్టు బ్రిటన్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మూడేండ్లలో ఆమె ఏ శిబిరంలో శిక్షణ పొందిందో చెప్పడం లేదు. దీంతో, బ్రిటన్ నిఘా వర్గాలు ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి వారితో దేశ భద్రతకు పెను విఘాతం ఏర్పడే ప్రమాదముందని బ్రిటన్ నిఘా వర్గాల చీఫ్ అలెక్స్ యంగర్ హెచ్చరిస్తున్నారు. బ్రిటన్లో గతంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఐఎస్లో చేరి స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారంతా దేశ భద్రతకు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు అయితే, అమెరికా మాత్రం తమ కస్టడీలో ఉన్న ఐఎస్ సభ్యులను విచారణ నిమిత్తం వారి స్వదేశాలకు తరలించేందుకు ప్రయత్నించడం గమనార్హం.