Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయాణీకులంతా సురక్షితం : రైల్వేశాఖ ప్రకటన
బెర్న్ : స్విట్జర్లాండ్లో ఓ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ రైలులో ఉన్న 240 మంది ప్రయాణీకులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. స్విట్జర్లాండ్లోని బేసెల్ నగరంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. బెర్లిన్లోని ఓస్లాబాన్హాఫ్ స్టేషన్ నుంచి స్విట్జర్లాండ్లోని ఇంటర్లెకిన్ ప్రాంతానికి బయల్దేరిన సమయంలో రైలు పట్టాలు తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు రైల్వే శాఖ పేర్కొంది.