Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌదీదా నగరం నుంచి వైదొలిగేందుకు సిద్ధమైన హౌతీ తిరుగుబాటుదారులు
సనా : యెమెన్లోని హౌదీదా ఓడరేవు నగరం నుంచి వైదొలిగేందుకు హౌతీ తిరుగుబాటుదారులు ఎట్టకేలకు అంగీకరించారు. ఈనగరంలో కొంత కాలంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుగుబాటుదారుల దాడులతో స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రాణభ యంతో ఇతర ప్రాంతాలకు పారిపోతు న్నారు. ఈనేపథ్యంలో రంగంలోకి దిగిన ఐరాస ప్రతినిధులు తిరుగుబాటుదా రులతో చర్చలు జరిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతమైనట్టు ఐరాస ప్రకటించింది. హౌదీదా నగరం నుంచి వైదొలిగేందుకు తిరుగుబాటుదారులు అంగీకరించారని తెలిపింది. యెమెన్లో నాలుగేండ్ల నుంచి అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలు అర్థాకలికతో అలమటిస్తున్నారు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా 51వేల టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసినట్టు యెమెన్ సర్కార్ పేర్కొంది. నిల్వ చేసిన చిరుధాన్యాలను, గోధుమలను ఆకలితో అలమటిస్తున్న 30లక్షల మంది నిరుపేదలకు అందజేయాలని నిర్ణయించుకున్నట్టు అధికారులు తెలిపారు.