Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాలి : మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని మాలీ క్రిమినల్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ పూర్తయేంత వరకు ఆయనను కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది. ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...అబ్దులా యామీన్ (59) మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఓ సంస్థకు చెందిన సభ్యుల నుంచి 1 మిలియన్ డాలర్ల ముడుపులు స్వీకరించినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మాల్దీవులు పర్యాటక రంగానికి ప్రసిద్ధి చెందినవి. ఇక్కడి ప్రభుత్వానికి పర్యాటక రంగం నుంచి అధిక మొత్తంలో ఆదాయం లభిస్తుంది. అయితే, పలు ప్రయివేట్ సంస్థలు కూడా దేశ పర్యాటక రంగం అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఓ ప్రయివేట్ సంస్థ పర్యాటక రంగం నుంచి 79మిలియన్ డాలర్లు ఆర్జించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదు. ఈ సంస్థ నిర్వాహకులు మాల్దీవ్స్ ఇస్లామిక్ బ్యాంక్లోని యామీన్ ఖాతాలో 1మిలియన్ డాలర్లు జమచేసినట్టు నిఘా వర్గాల విచారణలో తేలింది. ఈకేసు విచారణ కొనసాగుతున్నది. కాగా, ఏప్రిల్6న మాల్దీవుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి తరుణంలో యామీన్ అరెస్ట్ మాల్దీవుల్లో రాజకీయ పెను ప్రకంనలు సృష్టిస్తోంది.