Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు
కైరో: ఈజిప్టు రాజధాని కైరో నగరంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఓ ఉగ్రవాది మృతి చెందారు. మరో ముగ్గురు పోలీ సులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిం చి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈజిప్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం...కైరో నగరంలోని పోలీస్ క్వార్టర్స్కు సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అల్-దర్బ్ అన్-అహ్మర్ జిల్లా సరిహద్దులో గస్తీ పోలీ సులు ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిం చేందుకు ప్రయత్నించగా ఆత్మాహుతికి పాల్పడ్డాడు. భారీ పేలుడు కార ణంగా పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. పోలీస్ క్వార్టర్స్లో నివసిస్తున్న వారంతా ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. కాగా, ఈఘ టనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. ఈజిప్టులో 2013జులై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్ మోర్సీని గద్దె దించాలనే డిమాండ్తో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజలు వీధుల్లోకి చేరుకొని ఆందో ళన కార్యక్రమాలు నిర్వహించారు. సైనిక చర్యల కారణంగా మోర్సీ పదవి నుంచి వైదొలిగారు. అతన్ని తిరిగి అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ఓ ఉగ్ర సంస్థ పాకులాడుతోంది. మోర్సీకి మద్దతుగా పేలుళ్లకు పాల్పడుతోంది.