Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో భారత సంతతికి చెందిన దంపతుల మృతి
హోస్టన్ : భార్యను చంపి, ఆపై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన అమెరికాలోని టెక్సాస్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన నకిరేకంటి శ్రీనివాస్(51), శాంతి(46) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారం తమకు ఉదయం 6 గంటల సమయంలో అందిందన్నారు. వెళ్లిచూడగా తలపై తుపాకీ గాయంతో శాంతి మృతిచెంది ఉండగా, శ్రీనివాస్ కూడా గుండెపై గాయంతో చనిపోయి ఉన్నారని, అతని మృతదేహం పక్కనే తుపాకీ ఉన్నట్లు తెలిపారు. శ్రీనివాస్ తన భార్యను తుపాకీతో కాల్చి చంపి, అనంతరం తనను తానే కాల్చుకొని ఆత్మచేసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించామని పోలీసులు తెలిపారు. అయితే దంపతుల మధ్య ఎటువంటి గొడవలు లేవని తెలుస్తోందని తెలిపా రు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారని పొలీ సులు తెలిపారు. ఘటన సమయంలో 16 ఏళ్ల కుమార్తె నిద్రపోతుందని, ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదన్నారు. కుమారుడు టెక్సాస్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడని తెలిపారు. శ్రీనివాస్ హోస్టన్లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, శాంతి కంప్యూటర్ ప్రొగ్రామర్గా ఉంటుందని, వారి మధ్య ఎటువంటి మనస్పర్ధలు ఉండేవి కావని సన్నిహితులు చెబుతున్నారు. అందరితో కలిసిమెలసి ఉంటూ, అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారని తెలిపారు.