Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీలా: ఫిలిప్పీన్స్లో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతుండగా చక్రాల్లో ఒకటి రన్వేపై ఉన్న గడ్డిలో చిక్కుకుపోయింది. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగలేదు. వివరాల్లోకి వెళితే.. 122 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఓ తైవాన్ విమానం బుధవారం ఫిలిప్పీన్స్లోని కలిబో విమానాశ్రయానికి చేరుకుంది. అయితే విమానం రన్వే చివర్లో మలుపుతిరుగుతుండగా గడ్డిలో చక్రం చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన విమాన పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని చాకచక్యంగా నిలిపివేశారు. ఎయిర్పోర్టు సిబ్బంది అక్కడకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం తనిఖీల నిమిత్తం విమానాన్ని ఎయిర్పోర్టు టర్మినల్కు తరలించినట్టు అధికారులు వెల్లడించారు.