Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈయూ సదస్సులో ప్రకటించేందుకు కసరత్తు ప్రారంభించిన జర్మనీ
బెర్లిన్: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్ వ్యవస్థాపక అధినేత మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఐరోపా కూటమి వేదికగా జర్మనీ కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రతిపాదనపై జర్మనీ ఇప్పటికే ఈయూ సభ్యదేశాలతో సంప్రదింపులు ప్రారంభించినట్టు ఈయూ వర్గాలు వెల్లడించాయి. ఇటువంటి అంశాలపై ఐరోపా కూటమి ఏకాభిప్రాయ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో జర్మనీ ప్రతిపాదనకు ఈయూలోని 28 సభ్యదేశాలూ మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. మసూద్ అజర్పై ఈ నెల 15న ఆర్థికపరమైన ఆంక్షలు ప్రకటించిన ఫ్రాన్స్, ఈయూ ఉగ్రవాద సంస్థల జాబితాలో జైషేమహ్మద్ పేరును చేర్చేందుకు ఐరోపా దేశాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.