Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : బహుళజాతి విత్తన, పురుగుమందుల కంపెనీ మోన్శాంటోకు అమెరికా న్యాయస్థానంలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తోటలో మొక్కలకు మోన్శాంటో స్ప్రే చేసిన కారణంగా గొంతు క్యాన్సర్ సోకిందని సొనోమో కౌంటీ నగరానికి చెందిన ఎడ్విన్ హార్డెమన్ (70) అనే వ్యక్తి వ్యాజ్యం దాఖలు చేశాడు. 1980 నుంచి 2012వరకు తన తోటలోని మొక్కలకు మోన్శాంటో స్ప్రే చేశారని అఫిడవిట్లో పేర్కొన్నాడు. ఈ రసాయనం కారణంగా తాను క్యాన్సర్ బారినపడ్డానని, పరిహారం చెల్లించాలని మోన్శాంటో యాజమాన్యాన్ని కోరానని చెప్పాడు. అయితే, సదరు సంస్థ యాజమాన్యం పట్టించుకోకపోవడంతోనే తాను కోర్టుమెట్లెక్కానని కోర్టుకు తెలిపాడు. డ్వేన్ జాన్సన్ కేసులో పిటిషనర్ కూడా క్యాన్సర్ బారినపడ్డాడని, అతనికి పరిహారం అందజేయాలని కోర్టు జారీచేసిన ఆదేశాలను హార్డెమన్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. పిటిషనర్ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం హార్డ్మెన్కు రూ.2,003కోట్లు చెల్లించాలని మోన్శాంటో కంపెనీని ఆదేశించింది. ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...తోటలోని పూలమొక్కలకు మోన్శాంటో స్ప్రే చేసిన క్రమంలో తాను క్యాన్సర్ బారినపడ్డానని హార్డ్మన్ అనే పిటిషనర్ యూఎస్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాడు. మోన్శాంటో తయారు చేస్తున్న క్రిమిసంహారకాల్లో గ్లైఫోసేట్ ఉండటంతో క్యాన్సర్ సోకుతున్నదని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు. ఈసంస్థ ద్వారా తన క్లయింట్కు పరిహారం ఇప్పించాలని జడ్జిని అభ్యర్థించారు. తమ సంస్థ 40 ఏండ్ల నుంచి మోన్శాంటో తయారు చేస్తున్నదని, తమ ఉత్పత్తిలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని మోన్శాంటో తరుఫు న్యాయవాది వాదించారు. ఈకేసును కొట్టేయాలని న్యాయమూర్తిని అభ్యర్థించాడు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పై ఆదేశాలు జారీ చేసింది.
గతంలోనూ దావా ఎదుర్కొన్న మోన్శాంటో...
కాలిఫోర్నియాకు చెందిన డ్వేన్ జాన్సన్(46) గతేడాది ఆగస్టులో మోన్శాంటో కంపెనీపై దావా వేశారు. ఆయన బెనికాలో ఓ పాఠశాలలో గ్రౌండ్మెన్గా పనిచేసేవారు. విధుల్లో భాగంగా స్కూల్ ప్రాంగణం, మైదానంలో కలుపుమొక్కలు పెరగకుండా మోన్శాంటో తయారుచేసిన 'రౌండర్' మందును స్ప్రే చేసేవారు. ఈ కలుపుమొక్కల నాశినిలో ప్రధానంగా ఉండే గ్లైఫోసేట్ అనే రసాయనం వల్ల క్యాన్స సోకుతుంది. ఈ విషయం సంస్థాగత పరీక్షల్లో వెల్లడైనా మోన్శాంటో బయటకు చెప్పలేదు.రౌండప్ కలుపు నాశినిని తరచుగా వాడటంతో తెల్ల రక్తకణాలకు వచ్చే అరుదైన నాన్హడ్జ్కిన్స్ లింఫోమా అనే కేన్సర్ సోకినట్లు జాన్సన్కు 2014లో తెలిసింది. చికిత్స చేసినా జాన్సన్ బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చారు. 2015లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్(ఐఆర్క్) పరిశోధనలో సంచలన విషయం బయటపడింది. మోన్శాంటో తయారుచేస్తున్న కలుపుమొక్కల నాశనులు రౌండప్, రేంజ్ ప్రోలో కేన్సర్ కారక గ్లైఫోసేట్ అనే ప్రమాదకర రసాయనం ఉందని ఐఆర్క్ తేల్చింది. ఈ విషయాన్ని మోన్శాంటో వినియోగదారులకు తెలియజేయలేదని ఆఆర్క్ వెల్లడించింది. పిటిషనర్కి 78.5 మిలియన్ డాలర్లు (రూ.540 కోట్లు) చెల్లించాలని యూఎస్ ఫెడరల్ కోర్టు మోన్శాంటో కంపెనీని ఆదేశించింది.