Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్యాప్తు చేపడుతున్న యాంటీ టెర్రర్ స్క్వాడ్
లండన్ : న్యూజిలాండ్ మసీదులపై నరమేధం జరిగిన ఘటన మరువకముందే బ్రిటన్లోని మసీదులపై ఓ ఆగంతకుడు దాడులకు పాల్పడ్డాడు. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయప డలేదు. ఆగంతకుడి దాడిలో మసీదు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. కిటికీ అద్దాలను నిందితుడు సుత్తితో బలంగా పగలగొట్టి అనంతరం మసీదులో చొరబడేందుకు విఫలయత్నం చేసినట్టు నిఘా వర్గాలు అను మానిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. లండన్ పోలీస్ అధికారులు తెలి పిన వివరాల ప్రకారం.... బ్రిటన్లో ఇస్లామోఫోబియా ( ఇస్లాం మతం పట్ల ద్వేషం ) భావాలు పెరిగిపోతు న్నాయి. బర్మింగ్హామ్లోని నాలుగు మసీదులపై గురువారం దాడి జరిగింది. ఓ ఆగంతకుడు మసీదుల కిటికీ అద్దాలను సుత్తితో పగులగొట్టాడు. మసీదులోకి చొరబడేందుకు ప్రయత్ని ంచాడు. మసీదులో నిద్రిస్తున్నవారు ఆగంతకుడిని గమనించి అప్రమత్తం కావడంతో పలాయనమయ్యాడు. ఈ ఘటనపై బ్రిటన్ ప్రభు త్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. బ్రిటన్లోని మసీదులు, క్రైస్తవ ప్రార్థనాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్టు వెస్ట్మిడ్లాండ్స్ ఎస్పీ డేవ్ థామ్సన్ తెలిపారు. న్యూజిలాండ్లో జరిగిన నరమేధం ఘటనకు బ్రిటన్ ఘటనకు దగ్గర సంబంధాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.