Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు మృతి, 30 మందికి గాయాలు
బీజింగ్ : చైనాలోని రసాయనిక కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకా రం... జియాంగ్షూ ప్రావిన్స్లో యాంచెంగ్లోని క్రిమిసంహారక మందు ల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సం ఖ్య పెరిగే అవకాశముంది. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలన్నీ దద్దరి ల్లాయి. భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పేలుడు సంభవిం చడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. పేలుడుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా 140 మిలియన్ల మంది వీక్షించారు. 28వేల మంది కామెంట్లు పెట్టారు. లియాంగ్వాంగ్ నగరంలో భూకంపం సంభ వించింది. రిక్టర్స్కేల్పై భూకంపం తీవ్రత 2.2గా నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. ఇదిలా ఉండగా, చైనాలో గతేడాది నవంబర్లో పీవీసీ ఉత్పత్తి కర్మాగారంలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 24 మంది మృతిచెందగా, మరో 21 మంది గాయపడ్డారు.