Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో తుపాకుల అమ్మకాలపై నిషేధం విధించినట్టు ప్రధాని జసిండా ఆర్డెర్న్ తెలిపారు. మిలటరీ స్టైల్ సెమీ ఆటోమెటిక్ గన్స్,అన్ని రకాల అసాల్ట్ రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్లును బహిరంగ మార్కెట్లో అమ్మ కాలపై పూర్తిగా నిషేధం విధిస్తున్నామని అన్నారు. గతశుక్రవారం క్రైస్ట్చర్చి నగర ంలోని రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. దేశంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తుపాకుల చట్టాల్లో పెను మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ప్రధాని తాజా ఆదేశాల ప్రకారం...హై కెపాసిటీ రైఫిళ్లతో పాటూ ఫైర్ ఆర్మ్ను మిలిటరీ తరహా ఆటోమేటిక్ తుపాకులుగా మార్చే పరికరాలను కూడా ఇకపై ఎవరూ అమ్మడానికి వీల్లేదన్నారు. సెమీ ఆటోమెటిక్ రివాల్వర్లతోపాటు శుక్రవారం నాటి కాల్పుల్లో నిందితుడు బ్రెంటన్ వాడిన అన్ని రకాల ఆయుధాలపైనా నిషేధం విధించారు. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందంటూ ప్రధాని అధికారిక ప్రకటన జారీ చేశారు. అదేవిధంగా కఠినమైన గన్ చట్టాలు వచ్చేనెల 11 నాటికి తీసుకురా నున్నామని తెలిపారు. తుపాకీ చట్టం అమల్లోకి రావడానికంటే ముందు మధ్యం తర చర్యగా ఆయుధాల అమ్మకాలపై బ్యాన్ విధించినట్టు జసిండా తెలిపా రు.క్రైస్ట్చర్చి నగరంలోని మసీదుల్లో గత శుక్రవారం ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారంటÊ అనే జాత్యహంకారి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 50మంది మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే స్పందించిన ప్రధాని జసిందా గన్ చట్టాల్లో వెంటనే మార్పులు తీసుకొచ్చారు.