Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరికి జీవితఖైదు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో రెండేండ్ల కిందట సంచలనం సృష్టించిన మషాల్ఖాన్ హత్య కేసులో పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు మరో ఇద్దరికి జీవితఖైదు విధించినట్టు తీర్పు వెలువరించింది. శిక్షపడిన ఇద్దరిలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన కీలక నేత కూడా ఉన్నారు. ప్రాసిక్యూషన్ వెల్లడిం చిన వివరాల ప్రకారం...ఖైబర్-పక్తూమ్ ప్రావిన్స్లోని మార్దాన్ యూనివర్సిటీ విద్యార్థి మషాల్ఖాన్(23) రెండేండ్ల కిందట దారుణ హత్య కు గురయ్యాడు. వర్సిటీ హాస్టల్లో ఇస్లాం మతానికి విరుద్ధంగా ఉపన్యసించాడని, దైవదూషణకు పాల్పడ్డాడని మషాల్ఖాన్ హత్యకు పాల్పడిన ప్రధాన నిందుతుడు విచారణలో అంగీకరించాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గతనె లలో కీలక నిందితునికి ఉరిశిక్ష విధించింది. 31 మందికి జైలుశిక్ష విధించింది. అభియోగపత్రాల్లో నమోదైన అభియోగాలు నిరూపితం కాకపోవ డంతో మరో 26 మందిని నిర్దోషులుగా తేల్చి వదిలి పెట్టింది. అంతేగాకుండా, మషాల్ఖాన్ అమాయ కుడని, అతను ఎలాంటి దైవదూషణకు పాల్పడ లేదని జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తులో వెల్లడైంది. తాజాగా, అధికార పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత ఆరిఫ్ ఖాన్తో పాటు మరో వ్యక్తికి యాంటీ టెర్రరిజం కోర్టు యావజ్జీవ కారాగారం విధించింది. మషాల్ ఖాన్ హత్య జరిగిన రోజున ఆరిఫ్ఖాన్ మర్దాన్ వర్సిటీలోనే ఉన్నాడని, మషాల్పై దాడికి పాల్పడిన నిందితులను అభినందించిన వీడియోలపై న్యాయ స్థానం విచారణ చేపట్టింది. హత్యకు ప్రేరేపించిన నేరంలో పాక్ కోర్టు ఆరిఫ్ఖాన్కు జీవితఖైదు విధించింది.
ప్రొఫెసర్ దారుణ హత్య :
బహల్పూర్ కళాశాల ప్రొఫెసర్ ఖాలీద్ హమీ ద్ను అదే కళాశాలకు చెందిన ఓ విద్యార్థి హత్య చేశాడు. వీడ్కోలు సమావేశంలో ఇస్లాం మతాన్ని కించపరిచే విధంగా ప్రొఫెసర్ ఉపన్యసించ డంతోనే తానీ హత్యకు పాల్పడినట్టు విచారణలో నిందితుడు అంగీకరించాడని బహల్పూర్ పోలీసు లు తెలిపారు. అంతేగాకుండా, కళాశాల యాజమా న్యం మహిళా విద్యార్థినులను వీడ్కోలు సమావేశా నికి ఆహ్వానించడంపై నిందితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పారు. ఈకేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.