Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా సుప్రీం కోర్టు తరువాత అంత శక్తివంతమైన న్యాయస్థానంగా పేరొందిన కొలం బియా జిల్లా సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన అమెరికన్ మహిళా న్యాయమూర్తిగా నియోమీ జహంగీర్ రావ్ (45) గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆమెతో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్లారెన్స్ థామస్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకు ఈ కోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న బ్రెట్ కవనాఫ్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించటంతో ఆయన స్థానంలో నియోమి రావ్ నియమితులయ్యారు. అప్పీల్స్ కోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించిన కాలంలో కవనాఫ్ లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తన ఆరోపణలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కొత్త న్యాయ మూర్తి నియోమిరావు తన భర్త అల్లెఫ్కోవిట్జ్తో కలిసి బైబిల్ గ్రంధం సాక్షిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. డెట్రాయిట్లో పార్సీ వైద్య దంపుతులు జరీన్రావ్, జహంగీర్ నరియోషంగ్లకు జన్మించిన నియోమి రావ్ ఈ పదవిని అధిరోహించిన రెండో భారతీయురాలు కావటం విశేషం. ఇంతకు ముందు ఈ పదవిలో భారత సంతతికి చెందిన అమెరికన్ న్యాయవాది శ్రీశ్రీనివాసన్ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.