Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 47కి చేరిన మృతుల సంఖ్య
బీజింగ్: చైనాలోని రసాయనిక కర్మాగారంలో సంభవించిన పేలుడులో మృతి చెందినవారి సంఖ్య శుక్రవారంనాటికి 47కి చేరుకుంది. 640 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. యాన్చెంగ్ పట్టణంలోని తియాన్జియాయీ రసాయన పరిశ్రమలో గురువారం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పేలుడు తీవ్ర స్థాయిలో ఉండడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం. ఇంకా విష వాయువులు లీకయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మరిన్ని పేలుళ్లు సంభవించవచ్చని భావిస్తున్నారు. రసాయనిక కర్మాగారం చుట్టుపక్కల నివసిస్తున్న వెయ్యి కుటుంబాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించడానికి దాదాపు 3500 మంది ప్రత్యేక వైద్య సిబ్బందిని రంగంలోకి దింపినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పేలుడు ధాటికి పరిశ్రమలోని కిటికీ అద్దాలు దాదాపు 6కి.మీ దూరంలో పడ్డట్టు స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు. .