Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60 మంది మృతి
ఆక్రా : ఘనాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢకొీన్న ఘటనలో 60 మంది మృతిచెందారు. మరో 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. పోలీస్ అధికారి జోసెఫ్ ఆంత్వీ గ్యావు తెలిపిన వివరాల ప్రకారం...బోనోలో తూర్పు ప్రాంతంలో రెండు బస్సులు ఢకొీన్నాయి. ఈ ఘటనలో 60 మంది మృతిచెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కో బస్సులో 50 మంది ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటను ఆర్పేశాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు ఆంత్వీ తెలిపారు.