Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్ : ఉభయ కొరియాల సంప్రదింపుల కార్యాలయం నుంచి ఉత్తర కొరియా తన సిబ్బందిని శుక్రవారం తొలగించిందని దక్షిణ కొరియా తెలిపింది. అమెరికా అధ్యక్షుడితో ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ సమావేశం విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఉభయ కొరియాల మధ్య సంబంధాలు బలోపేతమ వుతున్న సమయంలో గత సెప్టెంబరులో కేసంగ్ నగరంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. దక్షిణ కొరియా పునరేకీకరణ వ్యవహారాల ఉప మంత్రి చున్ హేసంగ్ విలేకర్లతో మాట్లాడుతూ, సంప్రదింపుల కార్యాలయం నుంచి సిబ్బందిని తొలగిస్తామని ఉత్తర కొరియా తమకు తెలియచేసిందని చెప్పారు. తమ అధినేత నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఉత్తర కొరియా, అమెరికాల మధ్య సంబంధాలు బలపడేందుకు, చర్చలు జరిగేలా చూడడంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కీలక పాత్ర పోషించారు.