Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెల్మాండ్ గవర్నర్కి గాయాలు
కాబూల్ : దక్షిణ అఫ్ఘాన్ నగరమైన లష్కర్ గాV్ాలో శనివారం జరిగిన వేడుకల్లో జంట పేలుళ్ళు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ళ కారణంగా ఇద్దరు మరణించగా, హెల్మాండ్ గవర్నర్తో సహా 23మంది గాయపడ్డారని భద్రతా, ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఔట్డోర్ స్టేడియంలో జరిగిన రైతు దినోత్సవ వేడుకలకు దాదాపు 1000 మంది హాజరయ్యారు. ఈ సమయంలో చోటు చేసుకున్న పేలుళ్ళలో గవర్నర్ మహ్మద్ యాసిన్ ఖాన్ గాయపడ్డారు. వెంటనే అధికారులు అక్కడ నుంచి ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియరాలేదు. స్టేడియంలో ఉంచిన పేలుడు పదార్ధాల కారణంగానే ఈ పేలుళ్ళు చోటు చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని కొన్ని రోజుల నుంచి జరుగుతున్న వేడుకల సందర్భంగా పలు పేలుళ్ళు జరిగాయి. గురువారం పేలుడుతోటే కొత్త ఏడాది ప్రారంభమైంది. ఆ దాడుల్లో ఆరుగురు మరణించారు. 23మంది గాయపడ్డారు.