Authorization
Mon Jan 19, 2015 06:51 pm
11 మంది మృతి, 11 మందికి గాయాలు
డమాస్కస్ : సిరియాలోని అలెప్పో నగరంపై రాకెట్ లాంఛర్ల ప్రయోగం జరిగింది. ఈ దాడుల్లో 11 మంది మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...అలెప్పో నగరంపై సోమవారం రాకెట్ లాంఛర్ల ప్రయోగం జరిగింది. తిరుగుబాటుదారుల కార్యకలాపాలు అధికంగా ఉండే ఇద్లిబ్ ప్రావిన్స్ నుంచి రాకెట్లు మెరుపువేగంతో దూసుకొచ్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడుల్లో 11 మంది పౌరులు మృతిచెందారు. హయాత్ తహ్రీర్ అల్ షామ్ మిలిటెంట్లు ఈదాడికి పాల్పడినట్టు బ్రిటన్కు చెందిన హక్కుల సంఘం పేర్కొంది. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఈ దాడికి పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు.