Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రిపోలీ : లిబియా రాజధాని ట్రిపోలీలో కొనసాగుతున్న ఘర్షణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఈనెల 4న రెండు వర్గాల మధ్య ప్రారంభమైన అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య సోమవారం నాటికి 121కి చేరుకుందని తెలిపింది. 561 మంది గాయపడ్డారని వెల్లడించింది. డబ్ల్యుహెచ్వో బృందాలు ట్రిపోలీలో సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపింది. యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆహార పదార్థాలు, మందులు సరఫరా చేసేందుకు వెళ్లిన సహాయక బృందాలపై దాడులు జరగడాన్ని డబ్ల్యుహెచ్వో తీవ్రంగా ఖండించింది. ట్రిపోలీలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా 13,500 మంది ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని ఐరాస పేర్కొంది.900 మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది.