Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 మంది మృతి, 50 మందికి గాయాలు
వాషింగ్టన్: అమెరికాపై మరోసారి టోర్నడోలు విరుచుకుపడ్డాయి. బలమైన ఈదురు గాలులతో దూసుకొచ్చిన టోర్నడోలు అమెరికాలోని తూర్పు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. టోర్నడోలు సృష్టించిన విధ్వంసంతో ఒహియో నగరంలో 8 మంది మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. టోర్నడోల ధాటికి షెల్బీ నగరంలోని చెట్లు, విద్యుత్స్తంభాలు నేలమట్టమయ్యాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహంలో ఇండ్లు కొట్టుకొనిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోర్నడోల తాకిడితో పర్యాటక ప్రాంతాల రూపు రూఖలు పూర్తిగా మారిపోయాయి. ఇండ్లు కోల్పోయిన బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక బృందాలు సహాయక చర్యల్లో నిమగమయ్యాయి. ప్రతీఏడాది ఏప్రిల్ నెలలో టోర్నడోలు అమెరికాపై తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తాయి. రాబోయే రెండు నెలలు వీటి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.