Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉభయచర సాయుధ డ్రోన్ బోట్..
బీజింగ్: చైనా తొలిసారి విజయవంతంగా ఉభయచర సాయుధ డ్రోన్ బోట్ను పరీక్షించింది. ఈ బోట్ నీటిలో, భూమిపై ప్రయాణిస్తూ శత్రు ఆయుధాలపై దాడులు చేయగలదు. దీనికిది మెరైన్ లిజర్డ్ః అని పేరుపెట్టింది. దీనిని చైనా షిప్ బిల్డింగ్ ఇండిస్టీ కార్పొరేషన్ పరిధిలోని వూచాంగ్ షిప్ బిల్డింగ్ ఇండిస్టీ గ్రూపు తయారు చేసింది. మెరైన్ లిజర్డు ఏకధాటిగా 1200 కిలోమీటర్లు ప్రయానించగలదు. దీనిని రిమోట్ కంట్రోల్ ద్వారాగానీ , శాటిలైట్ల సాయంతోగానీ నడపవచ్చు. దీనిలోని డీజిల్ ఆధారిత హైడ్రోజెట్ ఇంజిన్ 50 కిలోనాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. పడవ వలే సముద్రంలో కూడా ఇది ప్రయాణించగలదు. ఈ యంత్రం నడిచే కిల్లర్ అని చెప్పవచ్చు. దీనిలో ఎలక్ట్రో ఆప్టిక్ వ్యవస్థ, రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. దీనిపై రెండు మిషిన్ గన్స్ను అమర్చారు. నిట్టనిలువునా ప్రయోగించే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, యాంటీ షిప్ మిసైల్స్ ఉన్నాయి. ఏవైనా దీవులపై అక్రమణలు చేయడానికి వీలుగా ఈ మెరైన్ లిజర్డ్ను తయారు చేశారు. ఇది స్వల్ప దూరాలను నీటిలో ప్రయాణించి ఆపై భూభాగాల్లోకి ప్రవేశించే విధంగా ఇది ఉంది.