Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. వరదల్లో చిక్కుకొని 14 మంది మృతిచెందినట్టు ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు. మృతుల్లో 11 మంది బలూచిస్థాన్కు చెందినవారు కాగా, మరో ముగ్గురు కరాచీ నగరానికి చెందినవారని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టినట్టు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికార ప్రతినిధి ముక్తార్ అహ్మద్ తెలిపారు. కరాచీ నగరంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.