Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7వేల కోట్ల విరాళం
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్లో అగ్ని ప్రమాదానికి గురైన పురాతన నోటర్ డేమ్ క్యాథడ్రల్ చర్చి పునర్నిర్మాణం కోసం 7వేల కోట్ల రూపాయల విరాళం వచ్చినట్టు ఫ్రాన్స్ ప్రకటించింది.యేసు ప్రభు భక్తులు,హై పవర్డ్ మాగెట్స్ అందరూ కలిసి ఇప్పటికే రూ.6,800కోట్లు) చర్చి పునర్నిర్మాణం కోసం విరాళం ఇచ్చారు. ఏడేండ్ల సమయంలో కాకుండా వెంటనే చర్చిని పునర్మించాలని కోరుతూ పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి.
క్యాథడ్రల్ చర్చి నిర్మాణానికి సంబంధించి బుధవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ ప్రత్యేక క్యాబినెట్ సమావేశం నిర్వ హించారు. సెంట్రల్ పారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత నోటర్ డేమ్ కేథడ్రల్ చర్చిలో పైకప్పు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చర్చి భవనం కుప్పకూలి పోయిన విషయం తెలిసిందే. 12వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన చర్చిలో ఆధునీకరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.