Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురి మృతి, 13 మందికి గాయాలు
సియోల్ : దక్షిణకొరియాలో ఓ వ్యక్తి ఉన్మాదిగా మారిపోయాడు. ఓ అపార్ట్మెంట్లోకి చొరబడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ మైనర్ బాలిక కూడా ఉన్నది. అనంతరం నిందితుడు అపార్ట్మెంట్కు నిప్పంటించి పరారయ్యాడు. ఈ ఘటనలో మరో 13 మంది గాయపడ్డారు. రాజధాని సియోల్ నగరం నుంచి 435 కిలోమీటర్ల దూరంలో ఉన్న జింజు నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు సియోల్ పోలీస్ అధికారులు తెలిపారు.