Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కూళ్లకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు
వాషింగ్టన్ :కొలరాడో నగరంలో రెక్కీ నిర్వహించిన సాయుధ మహిళ కోసం పోలీసులు, ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో మహిళ సంచరించినట్టు సీసీటీవీ ఫుటేజ్లు లభ్యమయ్యాయి. ఎఫ్బీఐ అధికారి డీన్ ఫిలిప్ అనుమానిత మహిళ ఫొటోను విడుదల చేశారు. 'ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన ఆ మహిళ అత్యంత ప్రమాదకర మైంది, అత్యంత అప్రమత్తంగా ఉండాలి' అంటూ ట్విట్టర్లో హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొలరాడో నగరంలోని పాఠశాలకు సెలవు ప్రకటించినట్టు యాజమాన్యాలు వెల్లడించాయి. కాగా, 1999 ఏప్రిల్ 20న కొలంబిన్ హైస్కూల్లో నరమేధం జరిగింది. ఎరిక్ హారిస్, డిలాన్ క్లెబోర్డ్ అనే ఇద్దరు అమెరికన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. స్కూల్పై దాడికి పాల్పడి 12 మంది విద్యార్థులను, ఓ ఉపాధ్యాయురాలిని హతమార్చారు. ఈ ఘటన అనంతరం కొలరాడో స్కూల్స్ యజమాన్యాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.