Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒట్టావా : పాకిస్థాన్ రాజ ధాని ఇస్లామాబాద్లో వేధిం పులు ఎదుర్కొన్నట్టు కెనడాకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు పోకి రీలు అసభ్యంగా ప్రవర్తించి తనను వేధింపులకు గురిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. రావల్పిండి ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం...కెనడాకు చెందిన ఓ మహిళ గతేడాది పాకిస్థానీ పౌరున్ని వివాహం చేసుకుంది. ఇస్లాం మతం పట్ల పలు దేశాల్లో విద్వేషభావాలు (ఇస్లామోఫోబియా) పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇస్లామోఫోబియా భావాలను విడనాడాలని ప్రజలకు సందేశం ఇచ్చింది. ఈమేరకు పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. కెనడా నుంచి పాకిస్థాన్కు వచ్చి ఇక్కడి ప్రజలతొ మమేకమయ్యేందుకు ప్రయత్నించింది. ఈనెల15న సూపర్మార్కెట్కు వెళ్లిన తనను స్కూటర్పై వచ్చిన ఇద్దరు పోకిరీలు వెంబడించారని, అసభ్యకరమైన పదజాలంతో దూషించారని తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాకుండా, తన కారు డ్రైవర్ని బెదిరించి వ్యక్తిగత వివరాలు సేకరించి పరారయ్యారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుల గుర్తించి అరెస్ట్ చేసి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను అభ్యర్థించింది.