Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ఉగ్రవాదం ప్రమాదకరస్థాయిలో కొనసాగుతున్న పాకిస్తాన్లో పర్యటించడంపై పునరాలోచించుకోవాలని తమ పౌరులను అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. పాక్లో పర్యటించే సమయంలో 'అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలు'గా గుర్తించ బడిన బెలూచిస్తాన్, ఖైబర్ ఫక్తూన్ఖ్వా, ఆజాద్ కాశ్మీర్ ప్రాంతాలలో పర్యటించవద్దని ట్రంప్ సర్కారు ఒక ప్రకటనలో సూచించింది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితాలో పాకిస్తాన్ను లెవల్ 3 కేటగిరీలో పెట్టిన అమెరికా ప్రభుత్వం బెలూచిస్తాన్, ఖైబర్ ఫక్తూన్ఖ్వా, కేంద్ర పాలిత ఆదివాసీ ప్రాంతాలు, ఆజాద్ కాశ్మీర్లను లెవల్ 4 కేటగిరీలో పెట్టింది.
ఆజాద్ కాశ్మీర్లో పర్యటించే అమెరికన్ పౌరులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది