Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1 గా నమోదు
తైపీ : తూర్పు తైవాన్ను భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. భూకంపం వల్ల రాజధాని తైపీలోని పలు భవనాలు కంపించాయి. భూకంప కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలోనే రాజధాని ఉంది. ప్రధానంగా తీర ప్రాంతమైన హువాలీన్పై భూకంపం ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అక్కడి నుంచీ 10 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉంది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. భూకంపాలు తరచుగా వచ్చే సిస్మిక్ జోన్లో తైవాన్ కూడా ఉంది. ఈ సిస్మిక్ జోన్ను పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తున్నారు. భూమి చుట్టూ ఉండే ఈ రింగు భాగంలో భారీ అగ్ని పర్వతాలున్నాయి. వాటి కారణంగా తరచూ అక్కడి భూపలకాలు కదులుతున్నాయి. అవి కదిలినప్పుడల్లా భూకంపాలు వస్తున్నాయి. 2016లో దక్షిణ తైవాన్లో భూకంపం సంభవించడంతో 100 మందికి పైగా చనిపోయారు. 1999లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 7.6గా నమోదైంది. ఈ ప్రకృతి విపత్తులో 2వేల మందికి పైగా మృతి చెందారు.