Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిమ్ సర్కార్ డిమాండ్
ప్యాంగాంగ్ : అణ్వస్త్రాల నిర్మూలన అంశంపై అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య జరగనున్న కీలక చర్చల నుంచి యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోని బహిష్కరించాలని కిమ్ సర్కార్ డిమాండ్ చేసింది. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని కోరింది. ఉత్తరకొరియాని ఉద్దేశించి పాంపియో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈఏడాది హానోరులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరిగిన రెండో దఫా చర్చలు విఫలమయ్యాయి. గతేడాది ఉత్తరకొరియాలో పాంపియో నాలుగు సార్లు పర్యటించారు. కిమ్తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అయితే, అమెరికా విదేశాంగ మంత్రి చర్యల కారణంగా ఇరుదేశాల మధ్య చర్చలు ఫలప్రదమయ్యే అవకాశాలు కన్పించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతవారం ఓ మీడియా సమావేశంలో కిమ్ని ఉద్దేశించి పాంపియో చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. 'కిమ్ ఓ నియంత. ఆయన అరాచక పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కిమ్ పాలన అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి' అని అన్నారు. కాగా, ట్రంప్, కిమ్ మూడో దఫా భేటీ త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే.