Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29 మంది మృతి
లిస్బన్: పోర్చుగీస్లోని మదైరా ద్వీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 29 మంది మృతి చెందారు. మృతుల్లో 17 మంది మహిళలు ఉన్నారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ అతివేగంగా వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 55మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఇందులో జర్మనీ దేశస్తులు కూడా ఉన్నారు. ఘటనపై పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో సౌజా విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను మార్సెలో ఆదేశించారు.