Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆ దేశ ఆర్థిక మంత్రి అసద్ ఉమర్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గం నుంచి ఉమర్ వైదొలిగినట్టు అధికార పీటీఐ పార్టీ సీనియర్ నేత అసద్ ప్రకటించారు. సంక్షోభ సమయంలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలతోపాటు వ్యాపార వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసద్ తాజా నిర్ణయం తీసుకున్నారు. 'ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఇది' అని గురువారం మీడియా సమావేశంలో అసద్ అన్నారు. తనను పదవి నుంచి తొలగించడానికి కుట్ర జరుగుతున్నదో, లేదో తనకు తెలియదన్నారు.మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు బదులుగా ఇంధన శాఖ తీసుకోవాలని ఇమ్రాన్ కోరారని, అందుకు తాను సున్నితంగా తిరస్కరించానని, ఏ మంత్రిపదవి తీసుకోనని చెప్పానని ,దీనికి ఇమ్రాన్ ఆమోదం లభించిందని అసద్ తెలిపారు. కాగా, ప్రధాని ఇమ్రాన్కు అత్యంత సన్నిహితుల్లో అసద్ ఒకరు. ఆయన ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థతో చర్చలు జరిపారు. తన అమెరికా పర్యటన గురించి ప్రస్తావిస్తూ... గతంలో కన్నా మెరుగైన నియమ, నిబంధనలతో ఐఎంఎఫ్ ఒప్పందాన్ని ఖరారు చేసిందని చెప్పారు.