Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారుల జాబితాను అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) ప్రకటించింది. బాలికల సింగిల్స్ విభాగంలో ఎనిమిది మంది బాలుర సింగిల్స్ విభాగంలో ఎనిమిది మందిని 'ఐటా' ఎంపిక చేసింది. ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు న్యూఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన షేక్ హుమేరా, దామెర సంస్కృతి, భక్తి షాలకు అవకాశం లభించింది. ఈ టోర్నీ విజేతలు పారిస్లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ టోర్నీలో చైనా, బ్రెజిల్, జపాన్, కొరియా అమె రికాలకు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొంటారు.