Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురి మృతి
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లోని నిఘా ఏజెన్సీ కార్యాలయం ఎదుట కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. అఫ్ఘాన్ ప్రాథమిక నిఘా సంస్థ (ఎన్డీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం... హెరాత్ నగరంలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం ఎదుట శుక్రవారం కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆగంతకులు మిలిటరీ వాహనంలో బాంబు అమర్చినట్టు ఎన్డీఎస్ అనుమానిస్తున్నది. పేలుడు సంభవించిన సమయంలో ఘటనాస్థలంలో ఎక్కువ మంది లేకపోవడంతో అపార ప్రాణనష్టం తప్పింది. తాలిబన్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఎన్డీఎస్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. పేలుడు సంభవించిన పరిసరప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.