Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాగ్దాద్ : ఐఎస్ ఉగ్రసంస్థ శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాక్ సైన్యం దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 12 మంది మిలిటెంట్లు హతమయ్యారని ప్రకటించింది. మరికొందరు గాయపడ్డారని తెలిపింది. ఈదాడుల్లో భారీ మొత్తంలో ఐఎస్కు సంబంధించిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు ధ్వంసమయ్యా యని తెలిపింది. కిర్కుక్ ప్రావిన్స్లోని హవీజా ప్రాంతం, అన్బర్ ప్రావిన్స్లోని అల్రుత్బా నగరాలపై ఏక కాలంలో వైమానిక దాడులకు పాల్పడినట్టు ఇరాక్ జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ అధికార ప్రతినిధి యహ్యా రసూల్ తెలిపారు. 2017 నుంచి ఐఎస్కు వ్యతిరేకంగా ఇరాక్ బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదుల ప్రాబల్యమున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నాయి.